"తొలి ఏకాదశి", ఆషాఢమాసం లో వచ్చే ఈ పండుగ చాలా పవిత్రమైనది. ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. దీనినే "విష్ణు శయన ఏకాదశి" అని, "శయనైకాదశి" అని కూడా పిలుస్తారు. ఈ రోజు శ్రీ మహా విష్ణువు యోగ నిద్ర లోకి వెళ్తాడు కనుకనే దీనికి ఆ పేర్లు వచ్చినవి. అలా యోగ నిద్ర లోకి వెళ్ళిన శ్రీ మహా విష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. కనుకనే ఈ ఏకాదశి ని "విష్ణు ఉత్థాన ఏకాదశి" అంటారు. ఈ ఆషాఢమాసంలోనే తొలకరి వస్తుంది కాబట్టి ఈ ఏకాదశి కి "తొలి ఏకాదశి" అనే పేరు వచ్చింది.
సంవత్సరంలో వచ్చే అతి ముఖ్యమైన ఎకదశులలో ఇది ఒకటి. శంఖ,చక్ర,గ దా,పద్మాలు ధరించి;లక్ష్మీద ేవి పాదములు ఒత్తుచూ,ఆది శేషునిపై శయనించి ఉన్న విష్ణు ప్రతిమను పూజించాలి. ఈ ఏకాదశి వ్రతాన్ని 3 రోజులు చేయాలి.ఏకాదశి ఉపవాసం,ద్వాదశి పారణ ,త్రయోదశి రోజున స్వామి ప్రీతికై గాన,నృత్యాదులతో శేషశాయిని పూజించాలి.
ఇక ఈ పండుగ నాడే అతి ప్రాధాన్యమైన "చాతుర్మాస్య వ్రతం" మొదలవుతుంది. ఈ వ్రతాన్ని గృహస్థులు నాలుగు నెలల పాటు ఆచరించవలసి ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఆషాఢ మాసం లో మొదలైన ఈ వ్రతం శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం వరకు కొనసాగుతుంది. ఒక్కో నెలలో ఒక్కొక్క విధమైన నియమాలతో ఉపవాస దీక్షను ఆచరించ వలసి ఉంటుంది.
వ్రత సంకల్ప విధానం: ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించే వాళ్ళు
"త్వయి సుప్తే జగన్నాథ,జగత్సుప ్తం భవేదిదం|
విబుద్ధేచ విభుద్యేత,ప్రసన ్నో మే భవాచ్యుత||
చతురో వార్శికాన్ మాసాన్ దేవస్యోత్థాపన వధి|
శ్రావణే వర్జయేత్ శాకం దధి భాద్రపదే తథా||
దుగ్ధమాశ్వయుజే మాసి కార్తికే ద్విదళం త్యజేత్|
ఇమం కరిష్యే నియమం నిర్విఘ్నం కురుమేచ్యుత||
ఇదం వ్రతం మయాదేవ!గృహీతం పురతస్తవ|
నిర్విఘ్నం సిద్ధి మాయాతు ప్రసాదాత్తే రమాపతే||
గృహీతేస్మిన్ వ్రతే దేవ పంచత్వం యదిమే భవేత్|
తదా భవతు సంపూర్ణం ప్రసాదాత్తే జనార్దన||"
విబుద్ధేచ విభుద్యేత,ప్రసన
చతురో వార్శికాన్ మాసాన్ దేవస్యోత్థాపన వధి|
శ్రావణే వర్జయేత్ శాకం దధి భాద్రపదే తథా||
దుగ్ధమాశ్వయుజే మాసి కార్తికే ద్విదళం త్యజేత్|
ఇమం కరిష్యే నియమం నిర్విఘ్నం కురుమేచ్యుత||
ఇదం వ్రతం మయాదేవ!గృహీతం పురతస్తవ|
నిర్విఘ్నం సిద్ధి మాయాతు ప్రసాదాత్తే రమాపతే||
గృహీతేస్మిన్ వ్రతే దేవ పంచత్వం యదిమే భవేత్|
తదా భవతు సంపూర్ణం ప్రసాదాత్తే జనార్దన||"
అనే శ్లోకాలను పఠించాలి.
భావం: ఈ చాతుర్మాస్యాలలో శ్రావణంలో శాకాన్ని(కూర,దుంప,పళ్ళు,ఆకులు) వదులుతున్నాను,భాద్రపదంలో పెరు గును,ఆశ్వయుజంలో పాలను,కార్తికంలో ద్విదళ ధాన్యాన్ని(రెండు బద్దలుగా వచ్చే పెసలు మొదలైన గింజలు) విసర్జిస్తున్నాను.ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా ఆచరించేలా అనుగ్రహించు.ఒకవేళ వ్రతం మధ్యలో మరణం సంభవిస్తే వ్రత సంపూర్ణ సిద్ధిని అనుగ్రహించమని" ప్రార్థించి స్వామికి శుద్ధమైన జలంతో అర్ఘ్యం ఇవ్వాలి.
ఈ వ్రతం చేయటం వాళ్ళ ఆ సంవత్సరంలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. అంతేగాక దారిద్ర్య బాధలు తొలగడానికి తప్పక ఈ వ్రతాన్ని ఆచరించాలి అని ధర్మ శాస్త్రాల వచనం.
భావం: ఈ చాతుర్మాస్యాలలో శ్రావణంలో శాకాన్ని(కూర,దుంప,పళ్ళు,ఆకులు)
ఈ వ్రతం చేయటం వాళ్ళ ఆ సంవత్సరంలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. అంతేగాక దారిద్ర్య బాధలు తొలగడానికి తప్పక ఈ వ్రతాన్ని ఆచరించాలి అని ధర్మ శాస్త్రాల వచనం.
No comments:
Post a Comment